మళ్లీ రామ్ తో ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల ?

మళ్లీ రామ్ తో ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల ?

Published on Oct 23, 2022 11:23 PM IST

దర్శకుడు శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబినేషన్ లో “డిడి (డబుల్ డోస్) సినిమా వస్తోందని ఎనౌన్స్ చేశారు. ఎలాగూ 2007లో వచ్చిన ‘ఢీ’ సినిమా సూపర్ హిట్ అయింది. కాబట్టి, ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే..“ ఢీ ఢీ ” పై కూడా భారీ అంచనాలు ఉంటాయని అనుకున్నారు. అయితే, ఆ తర్వాత ఈ సినిమా పై మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు హీరో రామ్ తో శ్రీనువైట్ల తన తర్వాత సినిమాని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో హీరో రామ్ తో శ్రీనువైట్ల రెడీ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే, తాజాగా ఈ హిట్ కాంబినేషన్ కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనువైట్ల, రామ్ కి ఒక కథ చెప్పాడని.. రామ్ కి కథ కూడా బాగా నచ్చిందని.. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు