‘రవితేజ’ తో మళ్లీ ప్లాన్ చేస్తున్నాడా ?

‘రవితేజ’ తో మళ్లీ ప్లాన్ చేస్తున్నాడా ?

Published on Dec 27, 2022 1:02 AM IST

దర్శకుడు శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబినేషన్ లో “డిడి (డబుల్ డోస్) సినిమా వస్తోందని ఎనౌన్స్ చేశారు. ఎలాగూ 2007లో వచ్చిన ‘ఢీ’ సినిమా సూపర్ హిట్ అయింది. కాబట్టి, ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే..“ ఢీ ఢీ ” పై కూడా భారీ అంచనాలు ఉంటాయని అనుకున్నారు. అయితే, ఆ తర్వాత ఈ సినిమా పై మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు హీరో రవితేజతో శ్రీనువైట్ల తన తర్వాత సినిమాని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో హీరో రవితేజతో శ్రీనువైట్ల కలయికలో నీ కోసం, దుబాయ్ శీను, వెంకీ, “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రాలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీనువైట్ల, రవితేజకి ఒక కథ చెప్పాడని.. రవితేజకి కథ కూడా బాగా నచ్చిందని.. వచ్చే ఏడాది మార్చిలో వీరిద్దరి కలయికలో సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు