కమల్ హాసన్ ‘దృశ్యం’లో శ్రీదేవి నటించడం లేదు..!

Kamal-Haasan_sridevi

ఒకప్పటి హిట్ పెయిర్ కమల్ హాసన్, శ్రీదేవి కలసి నటిస్తున్నారు అనే వార్తలకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడింది. మలయాళంలో ఘన విజయం సాదించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో వెంకి రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

తమిళ ‘దృశ్యం’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీదేవి నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. వీటిని ఖండించారు చిత్రబృందం. శ్రీదేవిని అసలు సంప్రదించలేదని స్పష్టం చేశారు. తమిళ చిత్రానికి ఒరిజినల్ ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

సతీష్ పాల్ అనే మలయాళ రచయిత మే 2013లో తను రాసిన ‘ఒరు మజాకలతు’ అనే పుస్తకం నుండి ‘దృశ్యం’ కథను కాపీ కొట్టారని ఎర్నాకులం కోర్టులో కేసు వేసాడు. కోర్టు తమిళ ‘దృశ్యం’ షూటింగ్ ఆపేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. దాంతో షూటింగ్ ని నిలిపివేశారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదని యూనిట్ వర్గాలు చెప్పాయి.

Exit mobile version