బాక్సాఫీస్ వద్ద ఆగని “పఠాన్” విధ్వంసం

బాక్సాఫీస్ వద్ద ఆగని “పఠాన్” విధ్వంసం

Published on Mar 7, 2023 11:00 PM IST


కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా అదే దూకుడు ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం మరో 75 లక్షల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం హిందీ లో ఇప్పటి వరకూ 517 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో దీపికా పదుకునే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు