ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 మూవీపై అంచనాలను నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను రీసెంట్గా అధికారికంగా చాలా సింపుల్గా లాంచ్ చేశారు. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ భారీ చిత్రాన్ని రాజమౌళి తనదైన విజన్తో చాలా వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ను చాలా స్పీడ్గా పూర్తిచేసేలా ఆయన ప్రణాళిక వేస్తున్నాడట. దీనిలో భాగంగా హీరో మహేష్ బాబుతో పాటు మిగతా యూనిట్ కూడా ఈ షెడ్యూల్స్ స్పీడ్గా పూర్తయ్యేలా చూడాలని రాజమౌళి కోరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఇక ఈ సినిమాను అడ్వెంచర్ మూవీగా రాజమౌళి తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్.నారాయణ ప్రొడ్యూస్ చేయనుండగా ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.