SSMB 28 : ఆ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్న మూవీ టీమ్

SSMB 28 : ఆ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్న మూవీ టీమ్

Published on Feb 7, 2023 12:30 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ SSMB 28 మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మహేష్ తో త్రివిక్రమ్ దాదాపుగా పన్నెండేళ్ల తరువాత వర్క్ చేస్తున్న మూవీ కావడంతో తప్పకుండా ఈ మూవీ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు ఆడియన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే వారి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన స్టోరీ, స్క్రిప్ట్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల కొద్దిరోజులుగా హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఇప్పటికే ఒక పిక్ మొన్న లీక్ కాగా నేడు మరొక రెండు పిక్స్ లీక్ అయ్యాయి. కాగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో మూవీ టీమ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాలకి సంబంధించి పలువురు ఈ విధంగా పిక్స్, వీడియోస్ ని సోషల్ మీడియాలో లీక్ చేయడం సరైనది కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా ఈ విషయమై మూవీ టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు