ఒక్క అప్ డేట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్న సూపర్ స్టార్

ఒక్క అప్ డేట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్న సూపర్ స్టార్

Published on Dec 10, 2022 6:09 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం SSMB28 మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే యూనిట్ తెలిపింది. దాదాపుగా పన్నెండేళ్ల గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ ఈ మూవీ, కొన్నాళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణంతో వాయిదా పడింది.

ఇక అప్పటి నుండి ఈ మూవీ యొక్క అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నిర్మాతలైన హారికా హాసిని క్రియేషన్స్ వారు అఫీషియల్ గా అప్ డేట్ ఇచ్చారు. సూపర్ ఎనర్జీ తో రాబోయే జనవరి నుండి SSMB28 పట్టాలెక్కబోతోంది. ఇక అక్కడి నుండి మూవీ నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా రెడీ అవుతాయి అంటూ సూపర్ స్టార్ మహేష్, నిర్మాత నాగ వంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కలిసి దుబాయ్ లో దిగిన పిక్స్ ని హారికా హాసిని క్రియేషన్స్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. దానితో ఎంతో ఆనందం వ్యక్తం చేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేస్తున్నారు. ఆ విధంగా కేవలం ఒకే ఒక అప్ డేట్ తో ప్రస్తుతం ఈ పిక్స్ ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారాయి. మరి ఎంతో క్రేజ్ తో రూపొందుతోన్న ఈ మూవీ రేపు పూర్తి అయి, అనంతరం రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు