SSMB28 : ఒక్క అప్ డేట్ తో సోషల్ మీడియా షేక్

SSMB28 : ఒక్క అప్ డేట్ తో సోషల్ మీడియా షేక్

Published on Aug 19, 2022 1:30 AM IST

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్వరలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మరికొద్దిరోజుల్లో పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతాన్ని, మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

సూపర్ స్టార్, త్రివిక్రమ్ ల థర్డ్ కొలాబరేషన్ కావడంతో పాటు వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ వచ్చి పుష్కరం గడవడంతో దీనిపై కేవలం మహేష్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీని వచ్చే ఏడాది పక్కాగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది.

ఇక ఈ అప్ డేట్ వచ్చింది మొదలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీనిని అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కేవలం ఒక్క అప్ డేట్ కె ఇలా ఉంటె రేపు సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా రానున్న టీజర్, సాంగ్స్, ట్రైలర్, ఆపైన మూవీ అన్ని కూడా మరింత క్రేజ్ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ గ్రాండ్ స్కేల్ లో రూపొందనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు