SSMB29 మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట …!

SSMB29 మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట …!

Published on Aug 19, 2022 2:30 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు. అది వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుండగా అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు మహేష్ బాబు. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ యొక్క స్టోరీ పై ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు రాజమౌళి.

ఇప్పటికే బాహుబలి సిరీస్ సినిమాలు, ఆర్ఆర్ఆర్ సినిమా ఇలా మూడు సినిమాల భారీ విజయాలతో భారతదేశం గర్వించ దగ్గర దర్శకుడిగా గొప్ప పేరు గడించిన రాజమౌళి, నెక్స్ట్ మహేష్ తో చేయనున్న మూవీ కోసం అడ్వెంచరస్ కాన్సెప్ట్ లో సాగె స్టోరీ కోసం కసరత్తు చేస్తున్నారట. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే క్యూరియాసిటీ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరిలో ఉంది.

నిన్న ప్రముఖ హోస్టులు జోష్ ఓల్సన్, జాయ్ డోంట్ కలిసి నిర్వహించిన స్పాటిఫై పోడ్ క్యాస్ట్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ తో పాటు తన గత సినిమాల గురించి పలు విషయాలు షేర్ చేసుకున్న రాజమౌళి, సూపర్ స్టార్ తో చేయబోయే మూవీ కోసం ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నాం అని, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఇది మొదలయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించారు. మొత్తంగా అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన ఈ ప్రేస్టీజియస్ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాలి అంటే మరికొన్ని నెలలవరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు