SSMB29 : పక్కాగా సెట్స్ మీదకు వెళ్ళేది అప్పుడేనా …?

SSMB29 : పక్కాగా సెట్స్ మీదకు వెళ్ళేది అప్పుడేనా …?

Published on Jul 15, 2022 3:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక మూవీ చేయనున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దీని తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు సూపర్ స్టార్ మహేష్. ఆయన కెరీర్ 29వ మూవీగా రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఎంతో గ్రాండ్ లెవెల్లో దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుండగా దీనిని వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కించనున్నారట. ఇప్పటికే మూవీ స్టోరీ విషయమై విజయేంద్ర ప్రసాద్ తో కలిసి వర్క్ స్టార్ట్ చేసిన రాజమౌళి, అది పూర్తి అయిన అనంతరం స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయనున్నారట. ఇక వచ్చే ఏడాది బిగినింగ్ లో ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుండగా ఆపైన సమ్మర్ లో పక్కాగా మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఇక ఈ భారీ మూవీ గురించి కొన్నాళ్ల తరువాత పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు