‘ కాంతారా’ ని మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరంటే ?

‘ కాంతారా’ ని మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరంటే ?

Published on Nov 3, 2022 12:20 AM IST


ఇటీవల కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక భారీ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా. విజయ్ కిరంగదూర్ తో నిర్మాతగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ కలెక్షన్ అందుకుని ఇంకా దిగ్విజయంగా దూసుకెళుతోంది. ఇటీవల ఈ మూవీని తెలుగు తోపాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. ప్రస్తుతం తెలుగులో కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది కాంతారా.

అయితే ఇటీవల జరిగిన ఒకానొక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి. నిజానికి మొదట ఈ సినిమా స్టోరీని తాను పునీత్ రాజ్ కుమార్ గారికి వినిపించానని అయితే అప్పట్లో ఆయన వరుసగా ఇతర సినిమాల షెడ్యూల్ తో బిజీగా ఉండటంతో ఈ సినిమాని చేయలేకపోయారని అన్నారు. అలానే అనంతరం కొన్నాళ్ల తర్వాత తానే హీరోగా చేస్తున్న సమయంలో సినిమా యొక్క విజన్ అలానే టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని పునీత్ సలహా ఇచ్చారన్నారు. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఈ ప్రెస్టీజియస్ సినిమాని మిస్ చేసుకున్నారు. ఒకవేళ ఆయన కనక ఈ కాంతారా సినిమా చేసి ఉంటే మరింతగా దీనికి గొప్ప గుర్తింపు వచ్చుండేదని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు