ప్రభాస్ – మారుతీ మూవీకి వర్క్ చేయనున్న స్టార్ కెమెరా మ్యాన్ ?

ప్రభాస్ – మారుతీ మూవీకి వర్క్ చేయనున్న స్టార్ కెమెరా మ్యాన్ ?

Published on Dec 17, 2022 5:13 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ తో ఆయన చేసిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు నాగ అశ్విన్ తీస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజక్ట్ కె, అలానే కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్, అలానే వీటితో పాటు యువ దర్శకడు మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా, ఇలా ఇవన్నీ సెట్స్ మీద ఉన్నాయి.

కాగా వీటిలో మారుతి తో ప్రభాస్ చేస్తున్న మూవీ పక్కా కమర్షియల్ జానర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు యువ భామలు ప్రభాస్ కి జోడీగా కనిపించనున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోండగా ప్రముఖ కెమెరా మ్యాన్ కార్తీక్ పళని దీనికి డీవోపీ గా వర్క్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తో పాటు ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ నటిస్తోన్న వారసుడు సినిమాలకు కార్తీక్ ఫోటోగ్రఫి అందించారు. కాగా ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ప్రభాస్ – మారుతీ క్రేజీ ప్రాజక్ట్ నుండి త్వరలో ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు