బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కొత్త చిత్రం బ్లడీ డాడీ జూన్ 9న జియో సినిమాలో OTT ప్రీమియర్ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే, ఈరోజు నటుడి కొత్త సినిమాని ప్రకటించారు. దీని ప్రకారం షాహిద్ కపూర్ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్తో చేతులు కలపనున్నాడు. ఈ దర్శకుడు నోట్బుక్, ముంబై పోలీస్, ఉదయాను తరం మరియు ఈవిడమ్ స్వర్గమను వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు. షాహిద్ కపూర్తో అతని చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని అంటున్నారు.
అత్యంత కీలకమైన కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ మరియు ZEE స్టూడియోస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రం 2023 ద్వితీయార్థంలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బ్లడీ డాడీ మరియు ఈ చిత్రంతో పాటు, షాహిద్కు అమిత్ జోషితో ఒక చిత్రం కూడా ఉంది, ఇందులో కృతి సనన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది.