యాత్ర కోసం తన సొంత గొంతు ను వినిపిస్తున్న స్టార్ హీరో !

దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’.
మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ ఆర్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈచిత్ర కోసం తన సొంత గొంతును వినిపించనున్నారు మమ్ముట్టి. ఈచిత్రానికి అయాన డబ్బింగ్ చెప్పడం కూడా ప్రారంభించారు. టీజర్ లో విన్న వాయిస్ కూడా ఆయనదే. ఇక రాజశేఖర్ రెడ్డి వాయిస్ ను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇష్ట పడుతారు. మరి ఈ మలయాళ స్టార్ హీరో తన గొంతుతో ఆ వాయిస్ ను మ్యాచ్ చేస్తాడో లేదో చూడాలి.

జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 70ఎమ్ఎమ్ పతాకం ఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది.

Exit mobile version