“సర్కారు వారి పాట” ఓటిటి రిలీజ్ అందులోనే.!

“సర్కారు వారి పాట” ఓటిటి రిలీజ్ అందులోనే.!

Published on May 12, 2022 12:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ ఈరోజు రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ మరియు టాక్ లతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో సందడి అయ్యాక ఏ స్ట్రీమింగ్ సంస్థలో అవ్వనుందో కన్ఫర్మ్ అయ్యింది.

ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి అమేజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. మరి అదెప్పుడు అనే ఇతర వివరాలు తర్వాత కన్ఫర్మ్ కానున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు