మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ గా నిలిచి దుమ్ము లేపింది. అయితే వీక్ డే లోనే రిలీజ్ అయ్యిన ఈ సినిమా పండుగ మూమెంట్ లో దుమ్ము లేపుతుంది. ప్రతీ రోజు కూడా ఇన్ని సినిమాల పోటీ ఉన్నప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు బుకింగ్స్ 4 లక్షల టికెట్స్ కి తగ్గడం లేదు.
దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదే ఊపు ఈ వారం మొత్తం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ వారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు.
