బరి నుంచి తప్పుకోనున్న “స్టూవర్ట్‌పురం దొంగ”.. రవితేజ మూవీకి లైన్ క్లియర్..!

బరి నుంచి తప్పుకోనున్న “స్టూవర్ట్‌పురం దొంగ”.. రవితేజ మూవీకి లైన్ క్లియర్..!

Published on Jan 21, 2022 9:58 PM IST


సినీ ఇండస్ట్రీలో ఒకే కథాంశంతో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గగా, మరికొన్ని సినిమాలు అలానే బరిలోకి దిగాయి. అయితే ఇప్పుడు రవితేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం తప్పిపోబోతుందని తెలుస్తుంది.

‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితచరిత్రను అదే టైటిల్‌తో రవితేజ హీరోగా వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

అయితే అదే కథాంశంతో ‘స్టూవర్ట్‌పురం దొంగ’ టైటిల్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కేఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది. టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు బరిలో నుంచి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ను తప్పించాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే రవితేజ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు