టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “సుందరం మాస్టర్”

ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు టైటిల్ రోల్ లో, డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి, ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి ఈటీవీ లో సుందరం మాస్టర్ ప్రసారం కానుంది. దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంటపు, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version