నన్ను దోచుకుందువటే ఫై యువ హీరో ఆసక్తికర కామెంట్ !

‘సమ్మోహనం’ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు హీరో సుధీర్ బాబు. ఆయన నటించిన తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కించిన ఈచిత్రం రేపు విడుదలవుతుంది. సుధీర్ బాబు సొంత ప్రొడక్షన్స్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈచిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటించింది.

ఇక తాజాగా ఈసినిమాను చూసిన యువ హీరో సందీప్ కిషన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే వున్నానని సుధీర్ బాబు, హీరోగా మరియు ప్రొడ్యూసర్ గా అదరగొట్టాడు. హీరోయిన్ నాబా కూడా చాలా బాగా నటించింది. ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కించిన ఈచిత్రం తప్పక చూడండి అని అయన అన్నారు.

Exit mobile version