సందీప్ కిషన్ “మైఖేల్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

సందీప్ కిషన్ “మైఖేల్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Dec 25, 2022 9:28 PM IST


సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ మైఖేల్. కరణ్ సీ.ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పీ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ లపై భరత్ చౌదరీ, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, దివ్యాన్ష కౌశిక్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ విడుదల అయ్యి సినిమా పై ఆసక్తి ను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ నీవుంటే చాలు ను డిసెంబర్ 28 న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు