రాజ్ తరుణ్ “అహ నా పెళ్లంట” కి సెన్సేషన్ రెస్పాన్స్!

రాజ్ తరుణ్ “అహ నా పెళ్లంట” కి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Dec 2, 2022 11:20 PM IST


యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవలే జీ5 వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌తో ఓటిటి అరంగేట్రం చేశాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో శివాని రాజశేఖర్ కథానాయిక గా నటించింది. ఈ సిరీస్ మంచి సమీక్షలను అందుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సిరీస్ కి జీ 5 లో సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటి వరకూ 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. సరదాగా సాగే ఈ వెబ్ సిరీస్ లో కామెడీ మరియు నటీనటుల నటన హైలైట్స్. ఇది ప్రస్తుతం ఇండియా లోని జీ5 వెబ్ సిరీస్ చార్ట్‌లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. తమడ మీడియా వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో ఆమని, పోసాని కృష్ణ మురళి, హర్ష వర్ధన్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, దీపాలీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఎనిమిది ఎపిసోడ్ల వెబ్ సిరీస్, మరియు షేక్ దావూద్ కథ మరియు స్క్రీన్ ప్లే రాశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు