“వీర సింహా రెడ్డి” సినిమాను చూసి అభినందించిన సూపర్ స్టార్ రజినీకాంత్!

“వీర సింహా రెడ్డి” సినిమాను చూసి అభినందించిన సూపర్ స్టార్ రజినీకాంత్!

Published on Jan 29, 2023 11:30 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ అభినందించిన విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది నాకు సర్రియల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి కాల్ ను రిసీవ్ చేసుకున్నా, రజినీకాంత్ వీర సింహా రెడ్డి సినిమాను చూశారు, ఆయనకు బాగా నచ్చింది. నా సినిమా గురించి అతని ప్రశంసలు మరియు అతను అనుభవించిన భావోద్వేగం నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు