వావ్ : మరొక రెండు రోజుల్లో ఇండియాలో ల్యాండ్ అవనున్న సూపర్ స్టార్…?

వావ్ : మరొక రెండు రోజుల్లో ఇండియాలో ల్యాండ్ అవనున్న సూపర్ స్టార్…?

Published on Jun 29, 2022 1:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట సక్సెస్ ని తన ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ పెట్ల తీసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని బాగా కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటిటిలో కూడా మంచి వ్యూస్ రాబడుతోంది. అయితే దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ మూవీ చేయనున్నారు మహేష్. ఇక ఇటీవల దీని అఫీషియల్ లాంచింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల మహేష్ ని జర్మనీలో ప్రత్యేకంగా కలిసి మూవీ స్టోరీ ఫైనల్ వర్షన్ వినిపించిన త్రివిక్రమ్, ప్రస్తుతం దానిని పూర్తిగా సిద్ధం చేసారని, ఇక మహేష్ బాబు మరొక రెండు రోజుల్లో ఇండియా రానుండడంతో అనంతరం ఆయనని కలిసి షూటింగ్ షెడ్యూల్స్ ఫైనలైజ్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ కొన్నాళ్ల విరామం తరువాత ఇండియా రానుండడం, అలానే త్వరలో మహేష్, త్రివిక్రమ్ మూవీ ప్రారంభం కానుండడం నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు