‘వాల్తేరు వీరయ్య’ తో సిసలైన సంక్రాంతి జరుపుకుంటారు – నటకిరీటి రాజేంద్రప్రసాద్

‘వాల్తేరు వీరయ్య’ తో సిసలైన సంక్రాంతి జరుపుకుంటారు – నటకిరీటి రాజేంద్రప్రసాద్

Published on Dec 27, 2022 10:01 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ప్రతిష్టాత్మక మూవీ వాల్తేరు వీరయ్య. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రాసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క మీడియా మీట్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరిగింది.

యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ మీట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ మూవీ గురించి అలానే తన పాత్ర గురించి దర్శకుడు బాబీ చెప్పినప్పుడు, అనంతరం సినిమా చేస్తున్నప్పుడే తనకు వాల్తేరు వీరయ్య పక్కా బ్లాక్ బస్టర్ ఖాయం అని అర్ధం అయిందని అన్నారు. ముఖ్యంగా కొన్నేళ్ల తరువాత మరొక్కసారి తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేస్తున్న ఈ మూవీ విడుదలతో మెగా అభిమానులు, తెలుగు ఆడియన్స్ సిసలైన సంక్రాంతి పండుగ చేసుకుంటారని అన్నారు. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు