సర్ప్రైజ్: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విశాల్ “రత్నం”

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు హరి తెరకెక్కించిన యాక్షన్ కం ఎమోషనల్ డ్రామా చిత్రం “రత్నం”. మరి గత నెల తెలుగు సహా తమిళ్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. మరి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఈ మే 24 నుంచి సినిమా అందుబాటులోకి వస్తుంది అని బజ్ వినిపించింది.

అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఒక రోజు ముందే అంటే నేటి నుంచే వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఇందులో ట్రై చేయవచ్చు. మరి ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతానికి మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version