హీరో సూర్యకు మరియు తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘాలకు మధ్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మించిన పోన్ మగళ్ వండాల్ మూవీ విడుదల విషయంలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆ సినిమాను సూర్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా దానిని వారు వ్యతిరేకించారు. సూర్య మాత్రం వారి బెదిరింపులు లెక్క చేయకుండా అమెజాన్ ప్రైమ్ లో ఆ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
కాగా సూర్య నటించిన సురారై పోట్రు షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీని లాక్ డౌన్ అనంతరం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఐతే సూర్య తమ మాట వినని కారణంగా సురారై పోట్రు మూవీ విడుదల అడ్డుకోవాలని థియేటర్స్ యాజమాన్యాలు ప్రణాళికలు వేస్తున్నారట. ఆ సినిమాకు థియేటర్స్ ఇవ్వకూడని వారి నిర్ణయమట. ముందుముందు సూర్య సినిమాకు ఇబ్బందులు తప్పవన్న మాత వినిపిస్తుంది.