‘లవ్ యు రా’ నుంచి తలసాని చేతుల మీదుగా సాంగ్ లాంచ్!

‘లవ్ యు రా’ నుంచి తలసాని చేతుల మీదుగా సాంగ్ లాంచ్!

Published on Sep 18, 2021 2:06 PM IST

నూతన నటీనటులు చిన్ను క్రిష్ మరియు గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా నిర్మించిన సినిమా ‘లవ్ యు రా’. ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను గౌరవనీయులు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ పాట మంచి స్పందన అందుకుంటుంది.

‘కేరాఫ్ కంచరపాలెం మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్’ అగస్థి పాడారు ,పాటలు రత్నం బట్లురి రాయగా,ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చిన ఈసినిమా కి రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. బ్రదర్ ఆనంద్ కొరియోగ్రఫీ అందించారు. ఇంకా ఈ సినిమా లో శేఖర్ బండి , సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు , జబర్దస్త్ కట్టప్ప లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

అలాగే ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ.. మా విన్నపాన్ని గౌరవించి ఈ సినిమా లోని పాటను విడుదల చేయడానికి ఒప్పుకున్నా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయన ఋణం తీర్చుకోలేనిది. అద్భుతమైన కథ తో సినిమా ను తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.. త్వరలోనే మంచి విడుదల తేదీ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం అని తెలిపారు.

అంతే దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.. “ఈ సినిమా లో ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను విడుదల చేసిన మినిస్టర్ శ్రీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథ ను వినగానే ఒకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు.. అయన ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంటాను. సినిమా చాలాబాగా వచ్చింది.. నిర్మాత ప్రతి పైసా కి అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.త్వరలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు.

అలాగే బ్యానర్ : సముద్రాల సినీ క్రియేషన్స్, కొరియోగ్రాఫర్ : బ్రదర్ ఆనంద్, ఛాయాగ్రహణం : రవి బైపల్లి, మ్యూజిక్ : ఈశ్వర్ పెరవలి, పాటలు : రాజారత్నం బట్లురీ, సింగర్స్- స్వీకర్ అగస్తి , ఈశ్వర్ పెరవలి, మేనేజర్ : సుధాకర్ విశ్వనాధుని
పోస్ట్ ప్రొడక్షన్ సి 2 సి స్టూడియో, ప్రొడ్యూసర్ : సముద్రాల మంత్రయ్య బాబు, కో ప్రొడ్యూసర్స్ : రవిచంద్ర సురేష్ బోయిన, చంద్రశేఖర రావ్ బండి, డైరెక్టర్ : ప్రసాద్ ఏలూరి, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, పర్వతనేని రాంబాబు వారు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు