టాక్..విజయ్ “వరిసు” ట్రీట్ వాయిదా..?

టాక్..విజయ్ “వరిసు” ట్రీట్ వాయిదా..?

Published on Oct 22, 2022 8:00 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో “వారసుడు” పేరిట రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఈ దీపావళి కానుకగా అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ టాక్ ఒకటి తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. బహుశా వరిసు ఫస్ట్ సింగిల్ రాకపోవచ్చని కానీ తర్వాత దీనికి మించిన పెద్ద ట్రీట్ నే మేకర్స్ వదులుతారని వారు అంటున్నారు. మరి దీనిపై మాత్రం అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా సినిమా ఫస్ట్ ట్రాక్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు