యంగ్ హీరో తనీష్, ముస్కాన్ సేథీ జంటగా జాని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “మరో ప్రస్థానం”. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మరో ప్రస్థానం’ కావడం విశేషం. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేడు తనీష్ పుట్టినరోజు సందర్భంగా “మరో ప్రస్థానం” టీమ్ ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు.
దేవుళ్లు, మన్మథుడు తదితర చిత్రాల్లో బాలనటుడుగా నటించి మెప్పించిన తనీష్ సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా పరిచయమై యూత్ని మెప్పించి మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత రైడ్, ఏం పిల్లో, ఏం పిల్లడో, మేం వయసుకువచ్చాం, తెలుగుబ్బాయి తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సస్ అందుకున్నాడు. అయితే తనీష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ మరో ప్రస్థానం మరో ఎత్తు అని చెప్పాలి. ఇప్పటి వరకు తనీష్ చేయని పాత్రను ‘మరో ప్రస్థానం’ చిత్రంలో చేశాడు.
ఈ సినిమా ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ను తనీష్ ఒక ఛాలెంజ్గా తీసుకుని చేశాడు. అతని పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్గా తనీష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. మరో ప్రస్థానం సినిమాకి తనీష్ యాక్టింగ్ హైలైట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. మరి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తనీష్కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించి.. అతడు మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి అడుగుపెట్టాలని మనం కూడా కోరుకుందాం.