దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి… ప్రస్తుతం బాలీవుడ్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది తాప్సీ. ప్రస్తుతం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియేంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే, ప్రస్తుతం మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్లో తాప్సీ నటిస్తోంది.
కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. మరి ఆ విషయాలు ఏమిటో తాప్సీ మాటల్లోనే విందాం. ‘నా కళ్లు చూడచక్కగా ఉండవు. నా జుట్టు కూడా రింగు రింగులుగా వికారంగా ఉంటుంది. అసలు సినిమాల్లో చూపించే హీరోయిన్స్లా నేను ఉండను. ఆఖరికీ
టీవీలో కనిపించే నటీమణులు కూడా నాకంటే బాగుంటారు కదా అని నేను ఫీల్ అయ్యేదాన్ని.
అందుకే నన్ను నేను మార్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ అందులో నేను విజయం సాధించలేదు. కాకపోతే నాకు ఒకటి అర్ధం అయింది. మనల్ని మనం ఎంతగానో ఇష్టపడితే, తప్పకుండా అందరికీ మనం ఎంతో అందంగా కనిపిస్తామని. ఇక అప్పటి నుంచి అందం పై నా అభిప్రాయం మారిపోయింది’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.