‘భీమ్లా నాయక్’ రిలీజ్ పై టెన్షన్ లో టీమ్ !

‘భీమ్లా నాయక్’ రిలీజ్ పై టెన్షన్ లో టీమ్ !

Published on Jan 17, 2022 6:16 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌ లో రాబోతున్న ‘భీమ్లా నాయక్’ రిలీజ్ విషయంలో భీమ్లా నాయక్ టీమ్ టెన్షన్‌ పడుతుంది. ఎప్పటి నుంచో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ చిత్రం జనవరి 12న విడుదల అవ్వాల్సింది. కానీ, చివరి నిమిషంలో వాయిదా పడింది. కాకపోతే ఫిబ్రవరి 25న మేము భారీ విడుదలకు సిద్ధంగా ఉన్నాం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

కానీ, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు వాయిదా పడుతున్నట్లే.. భీమ్లా నాయక్ ను కూడా పోస్ట్ పోన్ చేయాలా ? లేక రిలీజ్ చేయాలా ? అనే టెన్షన్ లో ఉన్నారట మేకర్స్. ఫిబ్ర‌వ‌రి మొదటి వారం క‌ల్లా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సతీమణిగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా భీమ్లా నాయక్ గా పవన్ , డ్యానియల్ శేఖర్ గా రానా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా ఈగో మీద నడవబోతుంది. నువ్వా – నేనా అంటూ పోటీ పడే ఇద్దరి ఆవేశపరుల కథ ఇది. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు