రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజెర్’ రిలీజ్ పై టీమ్ కసరత్తు ?

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజెర్’ రిలీజ్ పై టీమ్ కసరత్తు ?

Published on Apr 1, 2023 3:02 AM IST


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజెర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ ని రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోన్న యూనిట్, మూవీ రిలీజ్ విషయమై కూడా గట్టిగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ మూవీని రానున్న డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనేది టీమ్ ఆలోచన అట. మరోవైపు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. దానితో ఇండియన్ 2 ని ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలి అనేది ఆ మూవీ నిర్మాతల ఆలోచన అట. అయితే ఇండియన్ 2 కి ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫిక్స్ అయితే గేమ్ ఛేంజెర్ మూవీ సమ్మర్ కి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరి గేమ్ ఛేంజెర్ మూవీ రిలీజ్ డేట్ పై పక్కాగా క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు