చివరి దశ షూటింగ్‌లో “తీస్ మార్ ఖాన్”..!

చివరి దశ షూటింగ్‌లో “తీస్ మార్ ఖాన్”..!

Published on Oct 29, 2021 3:00 AM IST


టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా, గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తోన్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన్ ఫస్ట్ లుక్‌కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న ఆది సాయి కుమార్ ఈ పోస్టర్‌లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన చిత్రాల‌కు భిన్నంగా, ఇది వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర‌రైజేష‌న్‌తో ఉండనుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్‌, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్‌గా నిలవనున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు