మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘తేజ్ ఐలవ్యూ’. ప్రముఖ నిర్మాత కే ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘తేజ్ ఐలవ్యూ’. ఆడియోకు ప్రేక్షకుల నుంచి ఆద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీసుందర్ అన్ని సూపర్హిట్ పాటలు అందించారు.
కాగా జూన్ 21న సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని ‘నచ్చుతున్నాదే..’ సాంగ్ ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తేజ్ తో పాటు దర్శకుడు కరుణాకరన్ కెరీర్ కూడా ఈ చిత్రం కీలకం కానుంది.