చిత్రలహరి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయి ధరమ్ !

ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్నా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’ లో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఇక తాజాగా సాయి ధరమ్ ఒక ఇంటర్వ్యూ లో ఈచిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తండ్రి , కొడుకు మధ్య జరిగే ఈ కథకు నిరుద్యోగ యువత బాగా కనెక్ట్ అవుతారని అన్నారు. అలాగే ఈ సినిమా నన్ను విమర్శించే వారికి జవాబు ఇస్తుందని తేజు అన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదలకానుంది.

Exit mobile version