‘తెనాలి రామకృష్ణ’ ఆగష్టులో కష్టమే !

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. ఈ చిత్రం షూటింగ్ జులై రెండో వారం కల్లా పూర్తి చేసుకొని.. ఆగష్టులో సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అయితే సందీప్ కిషన్ మొన్న షూటింగ్ లో గాయపడటంతో షెడ్యూల్ మొత్తం పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాంతో సినిమా విడుదల పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితిల్లో ఆగష్టు లోపు సినిమా పూర్తయ్యేలా లేదట. మరి ‘తెనాలి రామకృష్ణ’ ఇక అక్టోబర్ లోనే వస్తాడేమో చూడాలి. కాగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో మంచి హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాని చేస్తోన్నాడు.

ముఖ్యంగా ఈ చిత్రంలో సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Exit mobile version