వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “థాంక్యూ”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “థాంక్యూ”

Published on Nov 7, 2022 10:28 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన తదుపరి ద్విభాషా చిత్రం NC 22 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఈ హీరో చివరి సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మరియు ఓటిటి లో ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది.

నవంబర్ 13, 2022న జెమినీ టీవీలో సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు