సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ నుంచి తాజాగా షూటింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో చివరి సాంగ్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్ రెడీ స్టార్ట్ చేశాము అని, ప్రస్తుతం శరవేగంగా పాట చిత్రీకరణ జరుగుతుందని చిత్రబృందం ట్వీట్ చేసింది.
పైగా ఈ సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ ను కూడా మరికొన్ని గంటల్లో పోస్ట్ చేస్తాం అని చెప్పుకొచ్చింది. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి ? అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
And we begin the final song shoot of #SarkaruVaariPaata and it's going to be ????????????????
Will drop BTS pics from the shoot ????
— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2022