200 కోట్ల కి చేరువవుతున్న “ది కేరళ స్టోరీ”

200 కోట్ల కి చేరువవుతున్న “ది కేరళ స్టోరీ”

Published on May 18, 2023 12:00 AM IST

దేశ వ్యాప్తంగా ది కేరళ స్టోరీ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమాగా థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 7.90 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ 164.5 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను కూడా బీట్ చేసి టాప్ 5 లో నిలిచింది.

ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్ లో త్వరలో చేరే అవకాశం కనిపిస్తోంది. అదా శర్మ, సిద్ది ఇడ్నాని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు