లేటెస్ట్..”ఆదిపురుష్” టోటల్ బడ్జెట్ రివీల్ అయ్యింది.!

లేటెస్ట్..”ఆదిపురుష్” టోటల్ బడ్జెట్ రివీల్ అయ్యింది.!

Published on Jan 27, 2022 6:14 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ రెండు సినిమాల షూటింగ్స్ ని తాను కంప్లీట్ చేసేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ప్లాన్ చేసిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” ఒకటి. ఇండియా లోనే ఏ సినిమాకి ప్లాన్ చెయ్యని హై ఎండ్ గ్రాఫికల్ టెక్నాలజీస్ తో భారీ విజువల్ వండర్ గా దీనిని ప్లాన్ చేశారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. మరి ఈ సినిమా బడ్జెట్ పట్ల ఆ మధ్య చాలానే హాట్ టాపిక్స్ వినిపించాయి. ఈ చిత్రంలో అధిక భాగం మోషన్ క్యాప్చర్ లోనే ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫిక్స్ కే అధిక బడ్జెట్ ని వెచ్చించాల్సి వచ్చింది అని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి.

మరి లేటెస్ట్ గా ఈ సినిమాకి అయ్యిన టోటల్ బడ్జెట్ ఫిగర్ తెలిసింది. ఈ సినిమాకి గాను నిర్మాతలు భారీ మొత్తంలో 400 కోట్లు ఖర్చు పెట్టారట. ఇంతకు ముందు ఇంకా ఎక్కువే ఈ సినిమాకి వినిపించింది కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం 400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారట. మరి ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు