అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ గొప్ప మనసులో ఎవరికి వారే సాటి

అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ గొప్ప మనసులో ఎవరికి వారే సాటి

Published on Nov 18, 2022 2:07 AM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ పోకిరి మూవీని థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. కాగా ఆ మూవీ యొక్క రీ రిలీజ్ కలెక్షన్ ని మహేష్ బాబు ఫౌండేషన్ కి అందించి తమ గొప్ప మనసు చాటుకున్నరు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇక ఆ తరువాత పవన్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ జల్సా మూవీని థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా దానికి కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

కాగా ఈ మూవీ రీ రిలీజ్ నుండి లభించిన కలెక్షన్ రూ. 1 కోటి ని కొద్దిసేపటి క్రితం మెగాబ్రదర్ నాగ బాబు చేతుల మీదుగా నా సేన నా వంతు కార్యక్రమానికి విరాళంగా పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ కి అందచేశారు ఫ్యాన్స్. కొద్దిసేపటి క్రితం వారు పవన్ ని కలిసి విరాళం చెక్ అందచేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ గొప్ప మనసు నిరూపించుకోవడంలో ఎవరికి వారే సాటి అని నిరూపించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు