“RRR” పై అవి ఫేక్ రూమర్స్..?

“RRR” పై అవి ఫేక్ రూమర్స్..?

Published on Mar 6, 2022 7:18 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం పాన్ ఇండియా వీక్షకులు సహా ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని బాక్సాఫీస్ షేక్ చెయ్యడానికి రెడీగా ఉన్న ఈ సినిమాపై లేటెస్ట్ గా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

మొదటి నుంచి కూడా ఈ సినిమాలో ఏ హీరో కి అధికార ప్రాధాన్యత ఉంటుంది అనేది ఆసక్తిగా ఉన్న ప్రశ్నే.. మరి దీనికి సమాధానంగా ఇరు హీరోలపై కూడా కొన్ని వెర్షన్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇద్దరిలో ఒకరి పాత్రకి విషాదాంతం ఉంటుందని వినిపిస్తుంది.

అయితే ఇవన్నీ కేవలం ఫేక్ రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది. ఇద్దరి హీరోలకి కూడా సామాన్య ప్రాధాన్యతే ఉంటుందని అలాగే ఏ పాత్ర కూడా విషాద ముగింపు ఉంటుంది లేనిది అనేది సినిమాలో చూసి మాత్రమే తెలుసుకోవాలని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి స్ప్రెడ్ అవుతున్న ఈ వెర్షన్ లు అయితే ఫేక్ అని మాత్రం అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు