ఈ సంక్రాంతి బిగ్గీ ల బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే!

ఈ సంక్రాంతి బిగ్గీ ల బుకింగ్స్ ఓపెన్ అయ్యేది అప్పుడే!

Published on Dec 26, 2022 12:43 PM IST

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి పండుగ కి నందమూరి బాలకృష్ణ వీర సింహరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ల వాల్తేరు వీరయ్య చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలకు సంబందించిన ప్రచార చిత్రాలు, వీడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి.

నందమూరి బాలకృష్ణ మూవీ వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న రిలీజ్ కానుండగా, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13 కి రిలీజ్ కానుంది. ఈ చిత్రాలు ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ కానున్నాయి. అయితే ఓవర్సీస్ లో డిసెంబర్ 29, 2022 న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీర సింహా రెడ్డి చిత్రానికి థమన్, వాల్తేరు వీరయ్య చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు