అన్‌స్టాపబుల్2: నాల్గవ ఎపిసోడ్ కి ఇద్దరు రాజకీయ నాయకులు!

అన్‌స్టాపబుల్2: నాల్గవ ఎపిసోడ్ కి ఇద్దరు రాజకీయ నాయకులు!

Published on Nov 16, 2022 2:00 AM IST


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో బిజీగా ఉన్నారు. అతను ఒక పక్క సినిమా చేస్తూనే, మరొక పక్క ఆహాలో తన టాక్ షో అన్‌స్టాపబుల్ 2 లో కూడా పాల్గొంటున్నాడు. సీజ‌న్ 2కి సెన్సేష‌న‌ల్ రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబుతో మొద‌టి ఎపిసోడ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివి శేష్ రెండు, మూడు ఎపిసోడ్‌లకు హాజరయ్యారు. నాలుగో ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డిలు పాల్గొంటారని తాజా సమాచారం. నాల్గవ ఎపిసోడ్ నవంబర్ 18న ప్రీమియర్‌గా ప్రసారం కానుంది అని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ కొత్త సీజన్‌లో పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. అయితే, షో రన్నర్లు ఇంకా ఎవరిని తీసుకువస్తారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు