ఒకే సమయం లో అలరిస్తున్న ఈ ఇద్దరి హీరోల సినిమాలు!

ఒకే సమయం లో అలరిస్తున్న ఈ ఇద్దరి హీరోల సినిమాలు!

Published on Mar 24, 2022 2:30 PM IST

చాలా కాలం తర్వాత ఈ ఏడాది బాక్సాఫీస్ బరిలో పెద్ద సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరియు అజిత్ కుమార్ వలిమై లు ఒకే సమయానికి అభిమానులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్ ను అందించాయి అని చెప్పాలి. ఒక్క రోజు గ్యాప్ తో ఈ రెండు చిత్రాలు థియేటర్ల లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అజిత్ కుమార్ వలిమై చిత్రం ఫిబ్రవరి 24 వ తేదీన థియేటర్ల లోకి రాగా, ఫిబ్రవరి 25 కి భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అదే విధంగా ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా భీమ్లా నాయక్ ప్రస్తుతం ఆహా వీడియో మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి రాగా, రేపు వలిమై జీ 5 లో ప్రసారం కానుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు థియేటర్ల రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఒక్క రోజు గ్యాప్ తో డిజిటల్ ప్రీమియర్ గా వచ్చి, ఫ్యాన్స్ ను అలరిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు