జీ5 లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్

జీ5 లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్

Published on Mar 21, 2023 8:00 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ మరియు టీనా శిల్పరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన రైటర్ పద్మభూషణ్ గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ తర్వాత, కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు జీ5 లో ప్రసారం అవుతోంది. తాజా అప్డేట్ ఏమిటంటే, సినిమా ఇప్పటికే OTT ప్లాట్‌ఫామ్‌లో తన ఆధిపత్యాన్ని ప్రారంభించింది.

ఇది ఇప్పుడు జీ5 ఇండియా మూవీస్ విభాగంలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫీల్ గుడ్ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గౌరీ ప్రియారెడ్డి, గోపరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకులు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు