తన క్రేజీ సీక్వెల్ ని అనౌన్స్ చేసిన స్టార్ డైరెక్టర్.!

తన క్రేజీ సీక్వెల్ ని అనౌన్స్ చేసిన స్టార్ డైరెక్టర్.!

Published on Dec 11, 2022 2:01 PM IST

తమిళ సినిమా నాట సహా మూవీ లవర్స్ లో కూడా ఓ బెంచ్ మార్క్ ని నెలకొల్పిన చిత్రం “జిగర్తాండ” కోసం చాలా మందికే తెలిసి ఉండొచ్చు. అలాగే ఈ చిత్రాన్ని అయితే తమిళ్ లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించగా ఇదే చిత్రాన్ని తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా “గద్దల కొండ గణేష్” పేరిట దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ చేయగా మన తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

మరి ఈ చిత్రంకి ఒరిజినల్ అయినటువంటి జిగిర్తాండ కి సీక్వెల్ పై ఎప్పుడు నుంచో మంచి టాక్ వినిపిస్తూ ఉండగా దీనిపై అయితే ఫైనల్ గా ఇప్పుడు దర్శకుడు క్రేజీ అప్డేట్ ని అందించాడు. ఈ చిత్రానికి ఈసారి “జిగర్తాండ డబుల్ ఎక్స్” గా టైటిల్ లాక్ చేసి ఓ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. అలాగే ఈరోజే సాయంత్రం ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి తమిళ్ లో గ్యాంగ్ స్టర్ సినిమాలు చేయడంలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి పేరుంది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు