ఈ దసరాకి వరుస సినిమాలతో ప్రేక్షకులకి సిసలైన పండుగ!

ఈ దసరాకి వరుస సినిమాలతో ప్రేక్షకులకి సిసలైన పండుగ!

Published on Aug 10, 2022 3:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున అక్కినేని ఇద్దరూ అక్టోబర్‌లో బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నారు. ఇప్పుడు వీరికి పోటీగా ఓ కొత్త నటుడు సిద్ధమయ్యాడు. నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్, స్వాతి ముత్యం చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నాడు. ఇది అక్టోబర్ 5, 2022న థియేటర్ల లో విడుదల కాబోతుంది అని తాజాగా మేకర్స్ వెల్లడించడం జరిగింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, నాగార్జున యొక్క ది ఘోస్ట్ అదే తేదీన మరియు చిరంజీవి యొక్క గాడ్ ఫాదర్ అదే రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. విష్ణు మంచు నటించిన మరో తెలుగు సినిమా జిన్నా కూడా అదే రోజు విడుదల కావాల్సి ఉంది. సో 4 సినిమాలు గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ దసరా తెలుగు సినీ లవర్స్ కి పండగలా ఉండబోతోంది. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు