“ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం” మెయిన్ హైలైట్ అదే!

“ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం” మెయిన్ హైలైట్ అదే!

Published on Nov 24, 2022 9:19 PM IST


అల్లరి నరేష్ తన కొత్త చిత్రం ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం చిత్తంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తనకంటూ ఓ డీసెంట్ బజ్ క్రియేట్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ, సినిమాలో చివరి ఇరవై నిమిషాలు కీలకం కానున్నాయని వెల్లడించారు. విలేజ్ డ్రామా మారేడుమల్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి బడ్జెట్‌తో రూపొందింది.

ఈ చిత్రంలో ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఇంకా వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ మోహన్ ఈ ప్రాజెక్ట్‌కి హెల్మ్ చేయగా, జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా దీనిని నిర్మిస్తున్నారు. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు