ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 107 వ సినిమాని అయితే దర్శకుడు గోపీచంద్ మలినేనితో “వీరసింహా రెడ్డి” గా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రం తర్వాత అయితే దర్శకుడు అనీల్ రావిపూడి తో తన కెరీర్ లో 108వ సినిమాని చేయనున్నారు. ఇక ఈ చిత్రం ఓ సాలిడ్ యాక్షన్ చిత్రంగా దీనిని ప్లాన్ చేస్తుండగా దీనిపై కూడా సాలిడ్ అంచనాలు అయితే నెలకొన్నాయి.
ఇక ఈ చిత్రంపై లేటెస్ట్ గా దర్శకుడు అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని షేర్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ వెర్సటైల్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తాను తెలిపాడు. అలాగే వర్క్ చెయ్యడం కూడా ఎంతో ఆనందంగా ఉందని తాను తెలిపారు. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Very Glad to be working with the incredibly versatile actor, dearest @realsarathkumar sir in #NBK108 ????
He is fit & fab as usual ???????? pic.twitter.com/Uhtl996lbu
— Anil Ravipudi (@AnilRavipudi) December 17, 2022